ఒక వృద్ధురాలైన మహిళ తన బ్యాంకు ఖాతా లో నుండి కొంత డబ్బు డ్రా చేసుకోవాలని బ్యాంకుకు వెళ్ళింది. అక్కడ ఉన్నబ్యాంకు క్యాషియర్ కి బ్యాంక్ కార్డును అందజేసి ఆమెతో “నేను రూ .500 ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను ..” అని అన్నారు.
ఆ మహిళా క్యాషియర్ ఆమెతో, “రూ.5,000 కన్నా తక్కువ డబ్బు డ్రా చేయడం కోసం కనుక అయితే, దయచేసి ఎటిఎం ఉపయోగించండి” అని అంది.
ఆ వృద్ధురాలు “ఎందుకు?” అని అడిగింది. వెంటనే ఆ క్యాషియర్ చిరాగ్గా, “ఇవి బ్యాంకు నియమాలు. వేరే విషయం లేకపోతే దయచేసి వెళ్ళండి . మీ వెనుక క్యూ ఉంది. అంటూ కార్డును వృద్ధురాలికి తిరిగి ఇచ్చేసింది.
వృద్ధురాలు రెండు నిముషాలు మౌనంగా ఉండిపోయింది. కానీ, వెంటనే ఆమె కార్డు క్యాషియర్ కి తిరిగి ఇచ్చి, “దయచేసి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఉపసంహరించుకోవడంలో నాకు సహాయపడగలరా” అని అడిగింది.
క్యాషియర్ వృద్దురాలి ఖాతా బ్యాలెన్స్ తనిఖీ చేసి చూసి చాలా ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమె (ఆ క్యాషియర్) చాలా వినయంగా, వృద్ధురాలితో, “నన్ను క్షమించండి మామ్మ గారు, మీ ఖాతాలో 350 కోట్లు రూపాయలు ఉన్నాయి మరియు మా బ్యాంకులో ప్రస్తుతం అంత నగదు లేదు. మీరు అపాయింట్మెంట్ ఇచ్చి రేపు మళ్ళీ రాగలరా? ” అని అడిగింది.
ఆ వృద్ధురాలు, “నేను ఇప్పుడు ఎంత ఉపసంహరించుకోగలను?” అని అడిగింది.
క్యాషియర్ రూ.300,000 వరకు ఎంతైనా ” అని చెప్పింది.
ఆ వృద్ధురాలు తన ఖాతా నుండి,రూ.300,000 ఉపసంహరించుకోవాలని చెప్పింది. క్యాషియర్ చక చకా ఆమె అడిగిన మొత్తాన్ని డ్రా చేసి చాలా మర్యాదగా వృద్ధురాలికి ఇచ్చింది. వృద్ధురాలు తన సంచిలో రూ. 500 ఉంచుకొని, మిగిలిన రూ.299,500 లను తిరిగి తన ఖాతాలో జమ చేయమని క్యాషియర్ ను కోరింది. క్యాషియర్ అవాక్కైది.
The moral of this story: అవసరానికి మాత్రమే వినయంగా ప్రవర్తించడం అనేది ఆమోదించతగిన విషయం కాదు. ఎవరినైనా గాని రూపాన్ని బట్టి కానీ, వారు ధరించిన దుస్తులను బట్టి గానీ మాత్రమే గౌరవించడం అనేది సరిఅయింది కాదు. ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలి.
మరిన్ని మంచి అంశాల కోసం మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానెల్ తప్పక ఫాల్లో అవ్వండి
How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?


