కాకి అరిస్తే చుట్టాలు రాకకు సూచకం అని అంటారు ఎందుకు..? కాకికి-మనుషులకు మధ్య గల సంబందం ఏమిటి..? అసలు ఈ సామెత ఎలా వచ్చింది..?
చక్కటి వివరణ….రామాయణ ఘట్టం”
శ్లొకం :- !! పక్షి చ శాఖా నిలయ: ప్రవత్త: సుస్వాగతాం వాచ మదీర యాన:!!
పక్షి కూత శుభ వాక్యాన్నీ వినడానికి నాందిగా భావించేందుకే ఈ కారణంగానే కాకి అరుస్తొంది…ఏ చుట్టాలొస్తారొ చూద్దాం అనే మాట లొకానికి వచ్చింది. దీనికి ఒక మహొత్తరమైన పురాణా గాథతొ సామెత వచ్చినది అని తెలుస్తొంది…..
రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి…సప్త సముద్రాలా అవనిలొ…లంకా నగరానికీ సమీపంలొ…ఆశొకవనంలొ ఒక మద్ది చెట్టు క్రింద ఆమేని వదిలి పెట్టి…రాక్షసులను కాపలా వుంచి అతి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళతాడు…రాజ్యం కాని రాజ్యంలొ…మనుషులు కాని మనుషుల మధ్యలొ…తనవారి జాడ అనేది తెలియని చొట…రాక్షసుల నీడలొ…రాక్షసుల వికృత ఆలవాట్లను చూస్తూ…సూటిపొటి మాటలతొ…ఆపుడపుడూ రావణాసురుడు వచ్చి పరస్త్రీ వ్యామోహ మాటలతొ…సీతమ్మ తల్లి ఆవేదనతొ బాధపడుతూ…మనసును కలచి వేస్తున్న సమయంలొ…ఎక్కడినుంచొ…ఎపుడూ కూడా…ఆ పరిసిర ప్రాంతంలొ కనిపించని పక్షి…ఒక్కసారిగా సీతమ్మ తల్లి కూర్చున్న మద్దిచెట్టు క్రొమ్మమీద వ్రాలి ఆమెని చూస్తూ పదే పదే అరవ సాగింది…
సీతమ్మ తల్లి తదేకంగా ఆ కాకి వైపు చూస్తూ…ఏ రాక్షస మాయతొ ప్రమాద సూచకమా అని అనుకొంటున్న తరుణంలొ…కొతిపిల్ల రూపంలొ వున్న హనుమ…సీతమ్మ ముంగటికి వచ్చి…రెండు చేతులతొ నమస్కరించి…నేను రామదూతని…మీ జాడ తెలుసుకు రమ్మని…సుగ్రీవ…రామ లక్ష్మణులు…పంపగా ఏడు యోజనముల సముద్రాలని దాటి…లంకా నగరమంతా గాలించిచూ…నార చీరలొ వున్న మిమ్మల్ని చూసి నా సీతమ్మ తల్లినే అని…తన నిజరూపాన్ని చూపి రాముడు ఇచ్చిన ఉంగరీయాన్నీ చూపగా మహానందంతొ ఆ మహాతల్లి సంతొషం వ్యక్తపరుస్తున్న తరుణంలొ…
ఆ కాకి…అంతవరకు ఆ క్రొమ్మమీదనే వుండి…కావ్.. కావ్.. కావ్.. అని అరుస్తూ సీతమ్మ ముంగట వాలగా…నీ అరుపుతొ నాకు శుభ సూచకం జరిగింది…ఏ చెట్టు అయితే నాకు నివాస గ్రుహంగా ఉన్నదొ…అటువంటి ప్రదేశంలొ నీ అరుపుతొ ఆ నివాసానికి శుభ సూచకం అవుతుందని…నీ వంశం వున్నంత వరకు అది లొకానికి శుభధాయకం అని వరం ఇచ్చింది…
ఈ సామెత ఆలా…రామాయణం కాలం నుండి…మన వరకూ కూడా కాకి అరుపు శుభ సూచకంగా భావిస్తున్నాం….స్వస్తి .
!! జై శ్రీరామ్ !! ..
How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?

